అసోంలో భారీ వర్షాల కారణంగా వరదలు బీభిత్సం సృష్టించాయి.గత కొద్దిరోజులుగా కురుస్తు్న్న వర్షాలకు అసోం అతలాకుతలం అవుతోంది. వరదల ఉధృతి బుధవారం( జూలై 1) కూడా తగ్గేలా లేదు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉధృతితో జనజీవనం స్తంభించిపోయింది. ఆరు జిల్లాల్లో 221 గ్రామాలు నీట మునిగాయి. ఆయాగ్రామాల్లో ప్రతి ఇంట్లో మోకాళ్లలోతు నీళ్లు చేరాయి. రోడ్లు కొట్టుకుపోయాయి..పంటలు వరదలపాలయ్యాయి. దాదాపు 50వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ASDMA) తెలిపింది. మంగళవారం రాత్రి ధేమాజీ జిల్లాలోని సిస్సిబోర్గావ్లో వరద నీటిలో కొట్టుకుపోయి ఒక మహిళ మృతిచెందింది.
భారీ వర్షాలు, వరదలతో అసోం లోని నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. బ్రహ్మపుత్రతో సహా రెండు ప్రధాన నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తుండగా, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇల్లు,పంట పొలాలు, రోడ్లు కొట్టుకుపోయి తీవ్రనష్టం వాటిల్లింది.
Assam flood situation worsens; Over 46,000 people affected#ASSAM: The flood situation in Assam has worsened as continuous heavy rainfall in neighbouring states has caused the water levels of several rivers to rise, inundating new areas. pic.twitter.com/2JHAGEbeiu
— Jehlam Times (@JehlamTimes) July 1, 2026
దేమాజీ, నల్బరి,దిబ్రూగర్,చిరాంగ్, లఖింపూర్, బిస్వనాథ్ జిల్లాల్లో దాదాపు 221 గ్రామాలు పూర్తిగ వరద నీటిలో చిక్కుకుపోయాయి. ఈ ప్రాంతాల్లో 45 వేల మందినిరాశ్రయులయ్యారు. వరదల ప్రభావంతో దేమాజీ జిల్లా తీవ్రంగా నష్టపోయింది.
►ALSO READ | భార్య లావుగా ఉందని.. పిల్లలు పుట్టడం లేదని..గొంతు నులిమి చంపిన భర్త...
Dhubri, Assam: The flood situation in Dhubri district has worsened as river water levels continue to rise. Rivers including Gaurang, Tipkai, Champabati, and Gangadhar are flowing above danger levels. An alert has been issued for riverbank and low-lying areas. Authorities are… pic.twitter.com/WvWQZ2WJeW
— IANS (@ians_india) June 30, 2026
