మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సంతాపం

మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సంతాపం

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. మాజీ గవర్నర్‌ ఎన్డీ తివారీతో పాటు ఇటీవల మృతి చెందిన 16 మంది మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ సంతాపం తెలిపింది. సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. పంచాయతీరాజ్‌, జీఎస్టీ బిల్లులకు సవరణలు చేస్తూ ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ లను బిల్లుగా సభ ముందు ఇవాళ ప్రవేశపెడ్తారు. శాసనసభ, మండలిలో నిన్న ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై ఇవాళ చర్చ జరగనుంది. బడ్జెట్‌పై చర్చ జరిగిన అనంతరం సీఎం కేసీఆర్‌ సమాధానం ఇవ్వనున్నారు.