కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ.వివేకానంద్ అధిక మెజారిటీతో గెలుపొందిన వ్యక్తిగా నిలిచారు. ఆయనకు 85,576 మెజారిటీవచ్చింది. తర్వాత.. ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ 81,660 మెజారిటీ వచ్చింది.
అలాగే, చేవేళ్ల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య అత్యల్పంగా 268 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. యాకుత్పురాలో ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్ 878 ఓట్ల మెజారిటీతో గెలిచారు.