![ఈస్టర్ వేడుకల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్](https://static.v6velugu.com/uploads/2024/04/assembly-speaker-gaddam-prasad-kumar-participated-in-easter-celebrations-held-at-church-in-vikarabad-district-center-on-sunday_o5lCLR6v93.jpg)
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని చర్చిలో ఆదివారం నిర్వహించిన ఈస్టర్ వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్గడ్డం ప్రసాద్ కుమార్పాల్గొన్నారు. చర్చి ఫాదర్ ఇచ్చిన సందేశాన్ని విన్నారు. ప్రత్యేక ప్రార్థనలకు హాజరైన భక్తులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వికారాబాద్ లోని ఏకేఆర్ స్టడీ సర్కిల్ కు సంబంధించిన 10 పుస్తకాలతో కూడిన డీఎస్సీ స్టడీ మెటీరియల్ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ఆవిష్కరించారు. మున్సిపల్ చైర్ పర్సన్ చిగులపల్లి మంజుల, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.