వికారాబాద్, వెలుగు: వికారాబాద్మున్సిపల్ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్పార్టీ చైర్మన్అభ్యర్థి, అసెంబ్లీ స్పీకర్కుమార్తె గడ్డం అనన్య తెలిపారు. శుక్రవారం నామినేషన్వేసిన అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి గడ్డం ప్రసాద్కుమార్ వికారాబాద్ ఎమ్మెల్యేగా, అసెంబ్లీ స్పీకర్గా ఉన్నందున పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు.
వికారాబాద్అభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యం కావాలని మున్సిపల్ఎన్నికల బరిలో దిగుతున్నట్లు చెప్పారు. తాను 17వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నానని, 34 వార్డుల్లో అత్యధిక వార్డులను కైవసం చేసుకుని మున్సిపల్లో కాంగ్రెస్ జెండా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్, సంతోష్కుమార్, అర్థ సుధాకర్రెడ్డి, రఘుపతిరెడ్డి పాల్గొన్నారు.
వికారాబాద్ పీఠం మాదే: కొండా విశ్వేశ్వర్రెడ్డి
వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకుంటామని చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు నామినేషన్ వేస్తున్న కార్యక్రమానికి శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వికారాబాద్ పట్టణ ప్రజలు స్పష్టమైన మార్పును కోరుకుంటున్నారని, అసెంబ్లీ స్పీకర్ వంటి బలమైన నాయకులు ఉన్నప్పటికీ బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు.
