60 జిల్లాల్లోనే కరోనా తీవ్రం..లాక్ డౌన్ తో మేలు జరిగిందా?

60 జిల్లాల్లోనే కరోనా తీవ్రం..లాక్ డౌన్ తో మేలు జరిగిందా?
  • లోకల్ లాక్​డౌన్​లతో మేలు జరిగిందా? అంచనా వేయండి
  • ‘మైక్రో కంటెయిన్ మెంట్ జోన్ల’పైనే ఫోకస్ పెట్టండి
  • వైరస్ పై పోరాడుతూనే ఎకనమిక్ యాక్టివిటీలు కొనసాగాలి 
  • టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్ కూడా ముఖ్యం
  • కరోనా కేసులు ఎక్కువున్న 7  రాష్ట్రాల సీఎంలతో మోడీ రివ్యూ

న్యూఢిల్లీదేశవ్యాప్తంగా 700కు పైగా జిల్లాలకు గాను 60 జిల్లాల్లోనే కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ఏడు రాష్ట్రాల్లో కేసులు చాలా తీవ్రంగా పెరుగుతుండటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెస్ట్ బెంగాల్, పంజాబ్ వంటి పలు రాష్ట్రాలు ఒకటి, రెండు రోజుల పాటు లోకల్ లాక్ డౌన్లు విధించిన నేపథ్యంలో.. అలాంటి లోకల్ లాక్ డౌన్ ల వల్ల వైరస్ కు సమర్థంగా అడ్డుకట్ట వేయగలిగారా? లేదా? అంచనా వేసుకోవాలని ప్రధాని సూచించారు. కరోనా కేసులు చాలా ఎక్కువగా ఉన్న 7 రాష్ట్రాల చీఫ్​మినిస్టర్లతో ప్రధాని మోడీ బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్ లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల సీఎంలతో పాటు హెల్త్ మినిస్టర్లు, రిప్రజెంటేటివ్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ..  వైరస్ పై పోరాటం కొనసాగిస్తూనే ఎకనమిక్ యాక్టివిటీలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యేలా చూడాలని చెప్పారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ప్రధానంగా ‘‘మైక్రో కంటైన్ మెంట్ జోన్స్’’పై ఫోకస్ పెట్టాలన్నారు. దీనివల్ల అటు వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంతో పాటు ఇటు ఎకనమిక్ యాక్టివిటీలు కొనసాగేందుకు వీలవుతుందన్నారు.

టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్, సర్వీలెన్స్ పై మరింతగా ఫోకస్ పెట్టాలని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎక్కువ మంది కరోనా పేషెంట్లకు సింప్టమ్స్ కనిపించడం లేదని, పాజిటివ్ వచ్చినా సామాన్య ప్రజలు అంత ఈజీగా నమ్మలేరని ప్రధాని చెప్పారు.  కొంతమంది ఈ రోగం తీవ్రతనూ తక్కువగా అంచనా వేస్తారన్నారు. అందుకే రూమర్లు వ్యాపించకుండా తగిన సమాచారంతో అవేర్ నెస్ పెంచేలా అఫీషియల్ మెసేజ్ లను సర్క్యులేట్ చేయాలని పీఎం సూచించారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మందులను ట్రాన్స్ పోర్ట్ చేసేటప్పుడు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. కరోనా వ్యాపించిన తొలి దశల్లో దేశవ్యాప్తంగా పెట్టిన లాక్ డౌన్ వల్ల చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయని, ఇప్పుడు మైక్రో కంటైన్ మెంట్ జోన్లపైనే ఫోకస్ ఉండాలన్నారు.

7 రాష్ట్రాల్లోనే 65.5% కేసులు..

దేశంలో నమోదైన అన్ని కరోనా కేసుల్లో 65.5 శాతం కేసులు ఈ ఏడు రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. మొత్తం కరోనా మరణాల్లో 77 శాతం మరణాలు, దేశంలోని అన్ని యాక్టివ్ కేసుల్లో 63 శాతం కేసులు కూడా ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఏడు రాష్ట్రాల్లో ఇటీవల కరోనా కేసులు గణనీయంగా పెరిగాయని, ప్రధానంగా మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీలో డెత్ రేటు.. కేస్ ఫెటాలిటీ రేట్ (సీఎఫ్ఆర్) కంటే 2 శాతం ఎక్కువగా ఉందని తెలిపారు. పంజాబ్, యూపీ తప్ప ఇతర ఐదు రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు.. నేషనల్ యావరేజ్ కంటే 8.52 శాతం ఎక్కువగా ఉందన్నారు. కరోనాను అంతం చేసేందుకు రాష్ట్రాలు, యూటీల గవర్నమెంట్లతో కేంద్ర ప్రభుత్వం కోఆర్డినేషన్ తో ముందుకు వెళుతోందని పేర్కొన్నారు.