రూ.30వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అసిస్టెంట్ ​లేబర్​ ఆఫీసర్

రూ.30వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అసిస్టెంట్ ​లేబర్​ ఆఫీసర్

తొర్రూరు,  వెలుగు: మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు అసిస్టెంట్​ లేబర్ ఆఫీసర్​ గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డారు. వరంగల్​ రేంజ్​ ఏసీబీ  డీఎస్పీ కె.సుదర్శన్​ తెలిపిన వివరాల ప్రకారం..  జిల్లాలోని చిన్నగూడూరు మండలం బావోజి తండాకు చెందిన దరంసోత్​ వెంకన్న కొడుకు నరేశ్​  2022 ఫిబ్రవరి 2న లేబర్ కార్డుకు అప్లై చేసుకున్నాడు.   ప్రమాదవశాత్తు డిసెంబర్​ 8న చనిపోయాడు. దీంతో అతడి తండ్రి వెంకన్న ఇన్సూరెన్స్​ క్లైమ్​ కోసం తొర్రూరు అసిస్టెంట్​ లేబర్​ ఆఫీసర్​ పి.సుమతిని కలిశాడు.

రూ.30 వేలు లంచం ఇస్తేనే  క్లైమ్​ చేస్తానని ఆమె డిమాండ్​ చేశారు. దీంతో బాధి తుడు వెంకన్న ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. మధ్యాహ్నం తొర్రూరు లేబర్​ ఆఫీస్​లో సుమతి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్, ఇన్​స్పెక్టర్లు శ్యాంసుందర్, రవి, వారి సిబ్బందితో  దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.