అమరావతి: తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఓ ఫస్ట్ ఇయర్ విద్యార్థినిని లోబర్చుకొని గర్భవతిని చేశాడు. ప్రొఫెసర్ లక్ష్మణ్ విద్యార్థినితో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించాడు మరో ప్రొఫెసర్. ఆ దృశ్యాలను చూపించి విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేశాడు.
వేధింపులు తాళలేక బాధిత విద్యార్థిని యూనివర్శిటీ వీసీకి ఫిర్యాదు చేసి యూనివర్శిటీ నుంచి ఇంటికి వెళ్లిపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కీచక ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ను వీసీ సస్పెండ్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో లక్ష్మణ్ కుమార్పై ఫిర్యాదు చేయడానికి యూనివర్సిటీ స్టాఫ్ వెళ్లగా.. బాధిత విద్యార్థినిని కంప్లైట్ చేయమని సూచించారు పోలీసులు. ఈ ఘటన యూనివర్శిటీలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రొఫెసర్ల తీరుపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
