ఇంటర్వ్యూలు పోస్ట్పోన్ చేశారని అసిస్టెంట్ వార్డెన్ అభ్యర్థుల ఆందోళన

ఇంటర్వ్యూలు పోస్ట్పోన్ చేశారని అసిస్టెంట్ వార్డెన్ అభ్యర్థుల ఆందోళన

గండిపేట్, వెలుగు: ప్రొఫెసర్​ జయశంకర్​ అగ్రికల్చర్​ వర్సిటీలో అసిస్టెంట్​ వార్డెన్​ పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలను అకస్మాత్తుగా వాయిదా వేయడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ నెల 20న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని చెప్పిన అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా పోస్ట్​పోన్​ చేశారని వారు ఆరోపించారు. శుక్రవారం అగ్రికల్చర్​ వర్సిటీ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు 10, పురుషులకు 10 అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ వార్డెన్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ విడుదల చేశారని, వాటికి ఎంతో మంది సన్నద్ధం కాగా ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇంటర్వ్యూలు ఆపారని వాపోయారు.