
గండిపేట్, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో అసిస్టెంట్ వార్డెన్ పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలను అకస్మాత్తుగా వాయిదా వేయడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ నెల 20న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని చెప్పిన అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా పోస్ట్పోన్ చేశారని వారు ఆరోపించారు. శుక్రవారం అగ్రికల్చర్ వర్సిటీ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు 10, పురుషులకు 10 అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారని, వాటికి ఎంతో మంది సన్నద్ధం కాగా ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇంటర్వ్యూలు ఆపారని వాపోయారు.