సుమత్రా దీవుల్లో వరద భీభత్సం 

సుమత్రా దీవుల్లో వరద భీభత్సం 

మెదన్ : ఇండోనేసియాలోని సుమత్రా ద్వీపంలో ఆకస్మిక వరదలు సంభవించడంతో శనివారం దాదాపుగా 12 మంది గల్లంతయ్యారు. కుండ పోత వర్షం కారణంగా శుక్రవారం అర్ధరాత్రి  కొండ ప్రాంతాల నుంచి  చెట్లు, రాళ్లు పడడంతో నది ఉప్పొంగింది. ఆనకట్టలు కూలి వరద గ్రామాలను వరద ముంచెత్తిందని ఓ స్థానికుడు తెలిపారు. టోబా సమీపంలోని గ్రామమైన సిమంగుళంపే తీవ్రంగా ప్రభావితమైందని చెప్పారు.