థాయ్​లాండ్​లో భారీ పేలుడు.. 17 మంది మృతి

థాయ్​లాండ్​లో భారీ పేలుడు.. 17 మంది మృతి

బ్యాంకాక్ : సెంట్రల్ థాయ్​లాండ్​లోని సుపాన్ బురి ప్రావిన్స్​లోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 17 మంది వరకు మృతి చెందారని అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. పేలుడుకు  కారణమేంటన్న వివరాలు తెలియరాలేదు. 

ఫిబ్రవరిలో జరుపుకునే చైనీస్ న్యూ ఇయర్​ వేడుకల కోసం ఇక్కడి ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున బాణ సంచా తయారు చేస్తున్నారు. గతేడాది జులైలోను దక్షిణ థాయ్ లాండ్​లోని ఓ బాణసంచా గోదాములో బారీ పేలుడు సంభవించింది. నారాతివాట్ ప్రావిన్స్​లో చోటు చేసుకున్న ఈ ఘటనలో 10 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు.