సికింద్రాబాద్ బస్టాప్‌లో దారుణం 

 సికింద్రాబాద్ బస్టాప్‌లో దారుణం 

సికింద్రాబాద్ 31 బస్టాప్‌లో  కాసేపు ఆటో ఆపి.. సులభ్ కాంప్లెక్స్ లో మూత్ర విసర్జనకు వెళ్లొచ్చేసరికి వెనుక డిక్కీలో పసికందు ప్రత్యక్షం అయింది. రెండు రోజుల పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. పుట్టిన ఆడపిల్లను పెంచి పోషించడం భారం అనుకుందో ఏమో కాని, ఆటో వెనుక సీటు ప్రక్కన ఉండే ఖాళీ స్థలంలో పాపాయి ని పడుకో బెట్టి వెళ్ళిపోయారు. ఆటో డ్రైవర్‌ వచ్చి చూడగా పాపాయి ఏడుస్తుండడంతో స్థానిక మోండ మార్కెట్‌ పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న మోండ మార్కట్‌ పోలీసులు సీసీటీవీల్లో వీడియోల ఆధారంగా ఎవరు వదిలిపెట్టి వెళ్లారన్నది దర్యాప్తు చేస్తున్నారు. పసికందును ఆసుపత్రికి తరలించి యోగక్షేమాలు చూస్తున్నారు పోలీసులు.