పంచాయతీ పోరు..బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య దాడి..పరిగి మండలం మాదారంలో ఉద్రిక్తత

పంచాయతీ పోరు..బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల  మధ్య దాడి..పరిగి మండలం మాదారంలో ఉద్రిక్తత

తెలంగాణ వ్యాప్తంగా మూడో ఫేజ్ పంచాయతీ ఎన్నిలకు పోలింగ్ కొనసాగుతోంది.  కొన్ని చోట్ల మినహా చాలా చోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు పల్లె జనం పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. 

వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో  ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ బూత్ లో ఉన్న ఏజంట్ లు గుర్తులు చెబుతున్నారని ఆరోపిస్తూ  బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది.  ఈ ఘటనలో సర్పంచ్ అభ్యర్థి రాములుపై ప్రత్యర్థులు దాడి చేశారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులిద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం  ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. మూడో విడతలో 182 మండలాల్లో మొత్తం 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. అందులో 394 పంచాయతీలు, 7,908 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 11 గ్రామ పంచాయతీలు, 116 వార్డుల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ప్రస్తుతం 3,752 గ్రామ పంచాయతీలకు, 28,410 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవికి 12,652 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 75,725 మంది క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.  లంచ్​ బ్రేక్​ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్​ ప్రక్రియ మొదలవుతుంది.