చేవెళ్ల, వెలుగు: ఫామ్హౌస్లలో పార్టీలు, లిక్కర్వాడకానికి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని ప్యూచర్సిటీ సీపీ తరుణ్జోషి ఆదేశించారు. శనివారం మొయినాబాద్లోని ఓ రిసార్ట్లో మొయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, షాబాద్ ఠాణాల పరిధిలో గల 750కు పైగా ఫామ్హౌస్లు, రిసార్ట్ల నిర్వాహకులతో సమావేశమయ్యారు. ప్రతీ ఫామ్హౌస్, రిసార్ట్లో సీసీటీవీ బ్యాకప్కనీసం 30 రోజులు ఉంచాలన్నారు.
రేవ్, డ్రగ్స్, హుక్కా పార్టీలు, జూదంపై నిషేధం ఉందని, ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం గెస్ట్ల వివరాలు ఆన్ లైన్లో నమోదు చేసేందుకు సేఫ్అతిథి యాప్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో చేవెళ్ల జోన్ డీసీపీ యోగేశ్గౌతమ్, ఏసీపీ కిషన్ తదితరులు పాల్గొన్నారు.
