మద్యం మత్తులో బ్యాంక్ ఆఫీసర్లపై దాడి

మద్యం మత్తులో బ్యాంక్ ఆఫీసర్లపై దాడి

ఆళ్లపల్లి, వెలుగు: ఆళ్లపల్లి మండల కేంద్రంలోని మర్కోడులో కొందరు యువకులు మద్యం మత్తులో డీసీసీబీ ఆఫీపర్లపై దాడిచేశారు. బుధవారం రుణాల రికవరీ కోసం బోడాయకుంటకు వెళ్లిన అసిస్టెంట్ మేనేజర్ సుమన్, స్టాఫ్​శోభన్, డ్రైవర్ వసీంను కొమరం రామ, లక్ష్మణ్, జోగ సాగర్ అనే ముగ్గురు పెద్దూరు సమీపంలో వెంబడించారు.

మర్కోడు సమీపంలో అడ్డుకున్నారు. శోభన్ ను కొట్టి ఫోన్​లాక్కున్నారు. వారి నుంచి తప్పించుకున్న బ్యాంక్​అధికారులు స్థానిక పీఎస్​లో ఫిర్యాదు చేశారు. సదరు యువకులు మర్కోడుకు చెందిన గడ్డం నరేందర్ పై కూడా దాడిచేసినట్లు తెలిసింది. ఎస్సై రతీశ్​కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.