- మద్యం తాగుతున్న వారిని మందలించడంతో అటాక్
భీమ్ గల్, వెలుగు: నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో పెట్రోలింగ్ కు వెళ్లిన ఎక్సైజ్ ఎస్ఐ, సిబ్బందిపై దాడి చేసి గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 16న సాయంత్రం పురాణిపేట్ గ్రామ శివారులో నాటు సారా అమ్ముతున్నట్టు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఎక్సైజ్ ఎస్సై నరసింహులు, తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలో పురాణిపేట్ శివారులోని మామిడి తోటలో మద్యం తాగుతున్న కొందరిని మందలించాడు. తర్వాత మరికొన్ని చోట్ల చెక్చేసి తిరిగి వస్తుండగా మద్యం తాగినవారు ఎక్సైజ్ ఎస్సై వాహనాన్ని అడ్డుకుని దాడి చేశారు. ఈ అటాక్లో ఎస్సై నరసింహులు స్వల్పంగా గాయపడ్డారు. దీనిపై ఎక్సైజ్ ఎస్సై పోలీసులకు కంప్లయింట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గంగుల శ్రావణ్ కుమార్ తెలిపారు.