పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్లో ఓ కరోనా పేషెంట్పై వార్డుబాయ్ అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆస్పత్రి ఐసీయూ విభాగంలో ట్రీట్మెంట్ పొందుతున్న మహిళా పేషెంట్ వద్దకు పీపీఈ కిట్ వేసుకొని వెళ్లిన వార్డుబాయ్.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన ఓ డాక్టర్.. అతడ్ని పట్టుకొని మందలించి మెడికల్ ఆఫీసర్లకు అప్పగించినట్లు హాస్పిటల్ మహిళా సిబ్బంది తెలిపారు. ఈ ఘటన మూడురోజుల క్రితం జరిగినట్లు వారు చెప్పారు. నిందితుడు ఓ కార్మిక సంఘం నాయకుడిగా చెలామణి అవుతున్నాడని, అందుకే పోలీసులకు అప్పగించకుండా వదిలేశారని మహిళా సిబ్బంది మండిపడుతున్నారు.
అప్పులు తెచ్చుడు కట్టుడు..ఆరేళ్లలో మిత్తీలకే రూ.56 వేల కోట్లు