గాంధీ హాస్పిటల్​లో కరోనా పేషెంట్​పై అత్యాచారయత్నం!

గాంధీ హాస్పిటల్​లో కరోనా పేషెంట్​పై అత్యాచారయత్నం!

పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్​లో ఓ కరోనా పేషెంట్​పై వార్డుబాయ్​ అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆస్పత్రి  ఐసీయూ విభాగంలో ట్రీట్​మెంట్​ పొందుతున్న మహిళా పేషెంట్​ వద్దకు పీపీఈ కిట్​ వేసుకొని వెళ్లిన వార్డుబాయ్.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన ఓ డాక్టర్​.. అతడ్ని పట్టుకొని మందలించి మెడికల్​ ఆఫీసర్లకు అప్పగించినట్లు హాస్పిటల్​ మహిళా సిబ్బంది తెలిపారు. ఈ ఘటన మూడురోజుల క్రితం జరిగినట్లు వారు చెప్పారు.  నిందితుడు ఓ కార్మిక సంఘం నాయకుడిగా చెలామణి అవుతున్నాడని, అందుకే పోలీసులకు అప్పగించకుండా వదిలేశారని మహిళా సిబ్బంది మండిపడుతున్నారు.

అప్పులు తెచ్చుడు కట్టుడు..ఆరేళ్లలో మిత్తీలకే రూ.56 వేల కోట్లు