మిమ్మల్ని చూస్తే నా లవరే గుర్తొచ్చింది.. సేమ్ టూ సేమ్

మిమ్మల్ని చూస్తే నా లవరే గుర్తొచ్చింది.. సేమ్ టూ సేమ్

గత నెల రోజుల నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా బేబీ(Baby) సినిమా గురించే డిస్కషన్ నడుస్తోంది. ఈ సినిమా సాధించిన విజయానికి ఇండస్ట్రీ ప్రముఖులు కూడా బేబీ టీమ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ రేంజ్ విజయాన్ని సాధించింది ఈ సినిమా. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్ తో చాలా లిమిటెడ్ గా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు సాయి రాజేష్(Sai rajesh). రిలీజ్ తరువాత ఏకంగా రూ.75 కోట్లు వసూలుచేసి బిగెస్ట్ హిట్ గా నిలిచింది. 

బేబీ సినిమా భారీ  విజయాన్ని సాధించిన నేపధ్యంలో ఇటీవల మెగా సెలబ్రేషన్స్ పేరుతో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బేబీ చిత్ర యూనిట్ ఆడియన్స్ తో ముచ్చటించారు. అందులో ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda) అభిమాని మాట్లాడుతూ.. బేబీ సినిమాలో విరాజ్ పాత్రకు నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నా నిజ జీవితంలో కూడా సేమ్ ఇలాంటి కథే ఉంది. అసలు అమ్మాయిలు ఎందుకు మోసం చేస్తారో అర్థం కావట్లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆతరువాత వైష్ణవి(Vaishnavi)ని ఉద్దేశిస్తూ.. మేడమ్ సినిమాలో మిమ్మల్ని చూసినప్పుడు మా లవరే గుర్తొచ్చింది. సేమ్ మీలాగే నా పోరి కూడా నన్ను మోసం చేసింది అన్నాడు. దీంతో పాపం హీరోయిన్ వైష్ణవి మొహం ఒక్కసారిగా మారిపోయింది. సమాధానం కూడా చెప్పలేకపోయింది వైష్ణవి. దానికి యాంకర్ స్పందిస్తూ.. అది సినిమాలో ఒక క్యారెక్టర్ అని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.