- బిహార్లోని ఔరంగాబాద్లో ఘటన
ఔరంగాబాద్: అబ్బాయిలతో మాట్లాడుతున్నారని తల్లిదండ్రులు మందలించడంతో నలుగురు బాలికలు సూసైడ్ చేసుకున్నారు. బిహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. హస్పూర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక దళిత బస్తీకి చెందిన 10 నుంచి 14 ఏండ్ల మధ్య వయసున్న ఐదుగురు బాలికలు జనవరి 29న విషపదార్థాలు తీసుకున్నారు. వీరిలో నలుగురు స్పాట్లోనే మృతి చెందారు. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ విషయంపై వారి తల్లిదండ్రులకు సమాచారం లేకపోవడంతో మృతదేహాలకు అదేరోజున పోస్ట్ మార్టం చేయకుండానే అంత్యక్రియలు నిర్వహించారు. మీడియాలో వార్తలు రావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ప్రాణాలతో బయటపడ్డ బాలిక నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. తల్లిదండ్రులు మందలించడంతో తాము ఐదుగురం విష పదార్థాలు తీసుకున్నామని ఆ బాలిక తెలిపింది. ఒకేసారి అందరం విషపదార్థాలు తీసుకోగా నలుగురు మరణించారని చెప్పింది.
