గాంధీభవన్​ను సందర్శించిన ఆస్ట్రేలియా  అంబాసిడర్ టీమ్

గాంధీభవన్​ను సందర్శించిన ఆస్ట్రేలియా  అంబాసిడర్ టీమ్

హైదరాబాద్​, వెలుగు: ఆస్ట్రేలియా అంబాసిడర్​టీమ్ బుధవారం గాంధీభవన్​ను సందర్శించింది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా హై కమిషనర్​ బారీ ఓ ఫారెల్, ఆస్ట్రేలియా కౌన్సిల్​ జనరల్​ సారా కిర్లూ, పొలిటికల్​ సెక్రటరీ ఆక్​ టేలర్​కాంగ్రెస్​ పార్టీ కార్యాలయాన్ని, అందులో ఉన్న శిలాఫలకాలను పరిశీలించారు. దాని నిర్మాణ శైలి గురించి తెలుసుకున్నారు. గాంధీభవన్ ను అణువణువునూ ఎంపీ ఉత్తమ్ కుమార్​ రెడ్డి​ వారికి చూపించారు. దాని విశేషాలను వివరించారు. అనంతరం ఉత్తమ్​తో వారు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్​ చౌదరి, పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ తదితరులు పాల్గొన్నారు.