
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ వ్యక్తిగత కారణాల వల్ల ఇండియా పర్యటనను వదిలి స్వదేశానికి వెళ్లిపోయాడు. ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారం కారణంగానే కమిన్స్ సిడ్నీకి బయలుదేరినట్లుగా క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది. ఇండోర్ లో మార్చి 1నుంచి జరగబోయే మూడో టెస్టు వరకు కమిన్స్ మళ్లీ జట్టుతో కలుస్తాడని తెలుస్తోంది. ఒకవేళ కమిన్స్ రాలేని పరిస్థితి ఉంటే అప్పుడు జట్టును వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ నడిపించే అవకాశం ఉంది. గతంలో కమిన్స్ అందుబాటులో లేని టైమ్ లో స్మిత్ రెండు సార్లు జట్టుకు నాయకత్వం వహించాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే వరుసగా రెండు టెస్టుల్లో ఆసీస్ జట్టు ఓడిపోయింది. ఈ సిరీస్లో ఆసీస్ గనుక క్లీన్స్వీప్ అయితే ఆ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడకపోవచ్చు.