ఉప్పల్, వెలుగు: రోడ్డు యాక్సిడెంట్లో ఓ వృద్ధుడు మృతిచెందాడు. హైదరాబాద్ నారాయణగూడకు చెందిన వేల్పుల నర్సింహ(65) గురువారం మనవరాలు తేజావతిని రామంతాపూర్– ఉప్పల్ ప్రధాన రహదారిలోని ఎన్ఎస్ఎల్ సాప్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ చేయడానికి వచ్చాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా ఉప్పల్ నుంచి రామంతాపూర్కు వెళ్తున్న గుర్తుతెలియని ఆటో ఢీకొట్టింది. దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
డీసీఎం ఢీకొని యువకుడు..
జీడిమెట్ల: డీసీఎం ఢీకొని యువకుడు మృతిచెందాడు. దుండిగల్ డబుల్ బెడ్రూం ఇండ్లలో నివాసముండే మహ్మద్ జహంగీర్ కొడుకు ముదాసీర్(22) ఇంటర్ పూర్తిచేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం తన ఫ్రెండ్ స్కూటీ తీసుకుని వెళ్లాడు. గాగిల్లాపూర్ నుంచి గండిమైసమ్మకు వస్తుండగా గండిమైసమ్మ పెట్రోల్ పంపు వద్ద స్కూటీనీ వెనక నుంచి ఓ టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముదాసీర్ స్పాట్లోచనిపోయాడు.
