పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్కు వచ్చే దివ్యాంగుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని వారికి సాయమందించాలని ఆర్థొపెడిక్డిపార్ట్మెంట్ హెచ్వోడీ, ప్రొఫెసర్ బి. వాల్యా అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సోమవారం గాంధీ హాస్పిటల్లోని ఆర్థొపెడిక్ విభాగం సెమినార్ హాల్లో పీజీ డాక్టర్లకు అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు.
శారీరక, మానసిక వైకల్యం ఉన్న వారి కోసం ఐక్యరాజ్య సమితి సూచనల మేరకు 2016లో ప్రత్యేక చట్టం రూపొందిందన్నారు. దివ్యాంగుల హక్కుల చట్టం –-2016లో పేర్కొన్న పలు అంశాలను ఆయన పీజీ డాక్టర్లకు పవర్ పాయింట్ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో ఆర్థొపెడిక్ విభాగం ప్రొఫెసర్లు డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్రవీందర్, పీజీ డాక్టర్లు పాల్గొన్నారు.