- రక్షణ చట్టాలపై కొనసాగుతున్న
- అవగాహన కార్యక్రమాలు
గచ్చిబౌలి, వెలుగు: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గచ్చిబౌలి భరోసా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు కొనసాగతున్నాయి. శుక్రవారం నిర్వహించిన అవేర్నెస్క్యాంపులకు లీగల్ కౌన్సిలర్లు పవిత్ర, అంజలి, కౌన్సిలర్ హేమ కెరెన్ పాల్ నేతృత్వం వహించారు. గచ్చిబౌలి విలేజ్లో 38 మంది స్థానిక నాయకులకు డిజిటల్అరెస్టులు, సైబర్క్రైమ్స్పై అవగాహన కల్పించారు.
రాయదుర్గంలో 62 మంది కమ్యూనిటీ ఇన్ఫ్లుయెన్సర్లకు పని ప్రదేశాల్లోమహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం, హనీ ట్రాపింగ్, భరోసా గురించి వివరించారు. లింగంపల్లిలో సెల్ఫ్హెల్ప్గ్రూపు మహిళలకు పోక్సో, గృహహింస, మహిళా హక్కులు ఇతర విషయాలపై అవగాహన కల్పించారు. సమాజంలోని వివిధ వర్గాలను చైతన్యపరచడం ద్వారా నేరరహిత సమాజాన్ని నిర్మించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు.
