ప్రముఖ జ్యోతిష్యుడు కుర్రానా కన్నుమూత

ప్రముఖ జ్యోతిష్యుడు కుర్రానా కన్నుమూత

బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. నటుడు ఆయుష్మాన్ కుర్రానా తండ్రి వీరేంద్ర ఖురానా అలియాస్ పండిత్ పి కుర్రానా కన్నుముశారు.  గతకొంతకాలంగా  గుండె సమస్యలతో బాధపడుతోన్న ఆయన .. చంఢీఘర్ లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.  

ఆయన అంత్యక్రియలు చండీగఢ్‌లోని మణిమజ్రా శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు.ఆయన మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు, ఆయుష్మాన్ కుర్రానా అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. .ఖురానా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.  

పండిత్ కుర్రానా విషయానికొస్తే ఈయన ప్రముఖ అస్ట్రాలజర్‌గా బాగా ఫేమస్. జ్యోతిష్యంపైనే అనేక రచనలు కూడా చేసారు.  బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్‌తో పాటు దర్శక, నిర్మాతలకు ఈయన గురువు. బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలకు ఈయన ముహూర్తం పెడుతూ ఉంటారు. 

అలా బాలీవుడ్ ప్రముఖులతోఉన్న పరిచయాలతో తన ఇద్దరు కుమారులను సినీ ఇండస్ట్రీలోకి వెళడంలో ఈయనదే కీలక పాత్ర అని చెప్పాలి. పండిత్ కుర్రానా మరో కుమారుడు  అపర్ శక్తి ఖురానా కూడా నటుడే. 

ఇక విక్కీ డానర్ సినిమాతో హీరోగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయుష్మాన్ కుర్రానా .. కొంతకాలంలోనే  నటుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.  అంధాదున్ సినిమాలో నటనకు గానూ ఆయన  విక్కీ కౌశల్‌తో కలిపి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు.