రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్ కుమార్

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్ కుమార్

హైదరాబాద్ : రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్ ను ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై శుక్రవారం సీఎం సంతకం చేశారు. రాష్ర్ధ ప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ప్రణాళికా సంఘం అత్యంత కీలకమైనది కావడంతో అనుభవజ్ఞుడైన వినోద్ కుమార్ ను ఈ సంఘానికి ఉపాధ్యాక్షుడిగా సిఎం నిర్ణయించినట్లుగా సీఎం కార్యాలయం ప్రకటించింది.

2019-20 ఆర్థిక సంవత్సరానికి త్వరలోనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో అన్ని శాఖలకు సంబంధించిన వ్యవహారాలను సమీక్షించి, ప్రతిపాదనలు తయారు చేసే కీలక పనిని కూడా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరించే వినోద్ కుమార్ కు అప్పగించారు సీఎం. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కేబినెట్ హోదా కలిగి వుండడంతో పాటు కేబినెట్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడిగా ఉంటారు. వినోద్ కుమార్ ఈ పదవిలో మూడేళ్లు కొనసాగుతారు.