తెలంగాణ ప్రభుత్వం పై కేసు పెట్టే ఆలోచనలో చంద్రబాబు

తెలంగాణ ప్రభుత్వం పై కేసు పెట్టే ఆలోచనలో చంద్రబాబు

ఐటీ గ్రిడ్స్ డేటా వ్యవహారంలో దూకుడుగా వెళ్లాలని  AP సర్కార్ నిర్ణయించింది. డేటా చోరీకి సంబంధించి తెలంగాణ సర్కార్ పై కేసు పెట్టాలని AP సర్కార్ డిసైడైనట్టు తెలుస్తోంది. మొత్తం రెండు కేసులు పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. ఒకటి టీడీపీ తరుపున… మరోటి AP సర్కార్ తరుపున తెలంగాణ ప్రభుత్వంపై కేసు ఫైల్ చేయాలని డిసైడయ్యినట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించి తెలంగాణ సర్కార్ పై పరువు నష్టం దావా వేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

మాదాపూర్ లోని ఐటీ గ్రిడ్స్ సంస్థ … టీడీపీకి సంబంధించిన సేవా మిత్ర యాప్ సహాయంతో… తెలుగుదేశం పరిపాలనకు వ్యతిరేకంగా ఉన్న ఆంధ్రప్రజల వివరాలు సేకరించి వారి ఓట్లు తొలగించేలా చర్యలు తీసుకుందని పోలీసులు ఆధారాలు సేకరించారు. లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ అధిపతి అశోక్ ను విచారణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్ర ఓటర్ల హక్కులను కాపాడతామని పోలీసులు చెప్పారు. ఐతే… తమ రాష్ట్ర డేటాను తెలంగాణ ప్రభుత్వం దొంగిలించిందని ఏపీ సర్కారు ఆరోపిస్తూ కఠినవైఖరి ప్రదర్శించేందుకు సిద్ధమైంది.