గోడ కూలి తల్లి కడుపులోనే శిశువు మృతి

గోడ కూలి తల్లి కడుపులోనే శిశువు మృతి

మెదక్ పట్టణంలోని మిలటరీ కాలనీలో గురువారం తెల్లవారు జామున ఇల్లు కూలి గర్భిణి తీవ్రంగా గాయపడగా, కడుపులోనే శిశువు చనిపోయింది. ఇంట్లో నిద్రిస్తున్న సర్వర్,​ఆయన భార్య చాంద్​ సుల్తానా, వీరి కూతురు, ఎనిమిది నెలల గర్భిణి  అయిన యాసిన్​ బేగంపై ఇంటి పెంకులు, మట్టి పడ్డాయి. 

యాసిన్ బేగం పొట్టమీద పెంకులు పడటంతో.. చికిత్స కోసం మెదక్ అక్కడి నుంచి హైదరాబాద్​ తరలించగా, అప్పటికే కడుపులోనే శిశువు చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. సర్జరీ చేసి మృత శిశువును బయటికి తీశారు.

ALSO READ:భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 18 మంది గల్లంతు