గణేషుడి పోలికలతో పుట్టిన బిడ్డ.. చూడటానికి ఎగబడ్డ పబ్లిక్​

గణేషుడి పోలికలతో పుట్టిన బిడ్డ.. చూడటానికి ఎగబడ్డ పబ్లిక్​

గణేషుడి పోలికలతో బిడ్డ పుట్టిన ఘటన రాజస్థాన్​లో జరిగింది. డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వార్​ జిల్లాకు చెందిన ఓ మహిళ జులై 31 అర్ధరాత్రి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డ ముఖంపై వినాయకుడి తొండంలాంటిది ఉంది. 

ఈ వార్త కాస్తా ఆ నోటా ఈ నోటా చేరడంతో వైరల్​ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఈ వింత చూసేందుకు జనం ఎగబడ్డారు. అయితే 20 నిమిషాల తరువాత బాబు చనిపోయాడు. 

ఇదే విషయాన్ని డాక్టర్ల వద్ద ప్రస్తావించగా.. జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటి అసాధారణ శిశువులు జన్మిస్తారని తెలిపారు. గర్భిణీలు క్రమం తప్పకుండా మెడికల్​ చెకప్​లు చేయించోవాలని వారు సూచిస్తున్నారు.