బడే మియాన్‌‌ చోటే మియాన్‌‌ .. ట్రైలర్‌‌‌‌ను విడుదల

బడే మియాన్‌‌ చోటే మియాన్‌‌ .. ట్రైలర్‌‌‌‌ను విడుదల

అక్షయ్‌‌కుమార్‌‌, టైగర్‌‌ ష్రాఫ్‌‌ హీరోలుగా వస్తున్న బాలీవుడ్‌‌ యాక్షన్‌‌, కామెడీ ఎంటర్‌‌‌‌టైనర్ ‘బడే మియాన్‌‌ చోటే మియాన్‌‌’. మానుషి ఛిల్లార్‌‌, ఆలయ ఎఫ్‌‌ హీరోయిన్స్. పృథ్విరాజ్ సుకుమారన్ విలన్‌‌గా నటించాడు. సుల్తాన్, టైగర్ జిందా హై చిత్రాల దర్శకుడు అలీ అబ్బాస్‌‌ జాఫర్‌‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మంగళవారం ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. డేంజరస్‌‌ సైకో విలన్‌‌గా పృథ్వీరాజ్‌‌ డైలాగ్స్‌‌తో ట్రైలర్ స్టార్ట్ చేశారు. అయితే తన వాయిస్‌‌ మాత్రమే వినిపిస్తుంది. తన ఫేస్ కనిపించకుండా మాస్క్‌‌తో ఉన్నాడు. ఇండియాకు సంబంధించిన మోస్ట్ పవర్‌‌‌‌ఫుల్‌‌ వెపన్‌‌ను అతను దొంగిలించాడు.

దాన్ని తిరిగి తీసుకొచ్చే మిషన్‌‌ను అక్షయ్, టైగర్‌‌‌‌కు అప్పగిస్తారు. ఇద్దరూ ఫ్రెండ్స్ అయినప్పటికీ టామ్ అండ్ జెర్రీలా గొడవపడుతుంటారు. ‘దిల్‌‌ సే సోల్జర్, దిమాక్‌‌ సే షైతాన్’ లాంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. వీళ్లిద్దరితో పాటు హీరోయిన్స్ మానుషీ చిల్లర్ ఆలయ ఎఫ్‌‌ కూడా ఈ మిషన్‌‌లో ఉంటారు. స్టన్నింగ్ యాక్షన్‌‌ సీక్వెన్స్‌‌తో కట్ చేసిన ఈ ట్రైలర్‌‌‌‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. పూజా ఎంటర్‌‌టైన్‌‌మెంట్స్‌‌, ఆజ్‌‌ ఫిలింస్‌‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్‌‌ 10న విడుదల కానుంది.