బద్రీనాథ్‌ జాతీయ రహదారి మూసివేత

బద్రీనాథ్‌ జాతీయ రహదారి మూసివేత

బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసివేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో కొండచరియలు విరిగిపడటంతో రహదారిని మూసివేశారు. రోడ్డు మూసివేతతో బద్రీనాథ్‌లో 200 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. దారి మధ్యలో ఉన్న 800 మందిని గోవింద్ ఘాట్ ప్రాంతంలోని గురుద్వారాకు తరలించి వసతి కల్పించారు. భారీవర్షాల  కారణంగా జాతీయరహదారిపై కొండచరియలు విరిగి పడటంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడే నిలచిపోయాయి. రోడ్డు మూసివేతతో బద్రీనాథ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది యమునోత్రి, గంగోత్రి, కేదారినాథ్, బద్రీనాథ్ ప్రాంతాల సందర్శనకు వచ్చి యాత్రికుల సంఖ్య 15 లక్షలమందికి దాటింది.