బైజూస్​ బాస్​ నేనే! : బైజు రవీంద్రన్

బైజూస్​ బాస్​ నేనే! : బైజు రవీంద్రన్

న్యూఢిల్లీ: ఇక నుంచి కూడా బైజూస్​సీఈఓను తానేనని, కంపెనీ నిర్వహణలో ఎలాంటి మార్పూ ఉండబోదని  బైజు రవీంద్రన్ ఉద్యోగులకు నోట్ రాశారు. తనకు వ్యతిరేకంగా శుక్రవారం నిర్వహించి అసాధారణ సర్వసభ్య సమావేశం (ఈజీఎం) ఒక ‘ఫార్స్​’ అని అన్నారు.  

రవీంద్రన్, ఆయన కుటుంబ సభ్యులను తొలగించాలంటూ వాటాదారులు ఈజీఎంలో ఏకగ్రీవంగా ఓటు వేశారు.  ఫౌండర్లు లేనప్పుడు నిర్వహించిన ఈజీఎంలో తీసుకునే నిర్ణయాలకు విలువ ఉండదని ఆయన స్పష్టం చేశారు. వాటాదారులు చాలా ముఖ్యమైన నిబంధనలను ఉల్లంఘించారని రవీంద్రన్ ఆరోపించారు.