బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కు బెయిల్ మంజూరు

బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కు బెయిల్ మంజూరు

నాంపల్లి కోర్టులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ కు ఊరట లభించింది. బెయిల్ మంజూరు చేస్తున్నట్టు నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కోర్టు వెల్లడించింది. రూ. 25 వేల ఫైన్ రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.  ప్రతిరోజు పోలీసుల ముందు హాజరుకావాలని కోర్టు క్రిశాంక్ కు తెలిపింది. 

ఓయూ సర్క్యులర్ ను మార్ఫింగ్ చేసి వైరల్ చేసినందుకుగాను క్రిషాంక్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో ఆయనను కొన్ని రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం క్రిశాంక్  చంచల్ గూడ జైల్లో ఉన్నారు.