బజాజ్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను సీ25ను సిద్ధి వినాయక బజాజ్ సంస్థ ద్వారా హైదరాబాద్ సైనిక్పురి షోరూంలో విడుదల చేసింది. మెటల్ బాడీతో తయారైన ఈ స్కూటర్ ఒక చార్జింగ్తో 113 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది.
ఇందులో 2.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ, కలర్ టీఎఫ్టీ కన్సోల్, బ్లూటూత్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. రివర్స్ మోడ్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటివి ఆదనపు ఆకర్షణలు. తెలంగాణలో దీని ధర రూ. 87,100.
