
‘అఖండ’ సూపర్ సక్సెస్తో జోష్ మీదున్న బాలకృష్ణ, రెట్టించిన ఉత్సాహంతో నెక్స్ట్ మూవీ షూటింగ్ని చకచకా పూర్తి చేసేస్తున్నారు. ఆయన హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. శ్రుతీహాసన్ హీరోయిన్. నిన్న ఈ మూవీకి సంబంధించి కొత్త అప్డేట్ ఇచ్చారు. ‘సింహం వేటకి సిద్ధం, ఫస్ట్ హంట్ లోడింగ్’ అంటూ ఓ పోస్టర్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పిడికిలి బిగించిన బాలయ్య చేతులు కనిపిస్తున్నాయి. ఈ నెల 10న ఆయన పుట్టినరోజు కావడంతో టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టు ఈ అప్డేట్ ద్వారా రివీల్ చేశారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ ఆకట్టుకోవడంతో టీజర్ ఎలా ఉండబోతోందోనని చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. వారి ఎదురు చూపులకు మరో మూడు రోజుల్లో తెర పడనుంది. అలాగే ఈ సినిమాకి ‘జై బాలయ్య’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. టీజర్తో పాటు టైటిల్ని కూడా రివీల్ చేసే అవకాశాలున్నాయి. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో కన్నడ హీరో దునియా విజయ్ విలన్గా నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా బాలకృష్ణ ఇమేజ్కి తగ్గ పవర్ఫుల్ స్టోరీతో తీస్తున్నాడు గోపీచంద్ మలినేని. ఇక ఈ సినిమా పూర్తవగానే అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలకృష్ణ నటించనున్నారు.