ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి

ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి

ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలన్నారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులర్పించారు బాలకృష్ణ. ఎన్టీఆర్ జీవిత మూలాలు భవిష్యత్ తరాలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్ పేదల‌ పెన్నిది‌‌.‌.ఆడపడుచులకు అన్న అని అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..ఎన్టీఆర్ బతికుంటే ఆంధ్రరాష్ట్ర పరిస్థితి చూసి చలించిపోయేవారన్నారు. వనరులు లేకపోయినా చంద్రబాబు పాలన అద్భుతమన్నారు. జగన్ పాలనలో ఏపీ ప్రజలు తీవ్రంగా బాధపడ్తున్నారని.. ఎన్టీఆర్ స్పూర్తితో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీని బలోపేతం చేస్తామన్నారు.