రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాంధీ ఆసుపత్రిలో ఖైదీల పరారీ కేసులో పురోగతి సాధించారు బాలానగర్ పోలీసులు . పారిపోయిన నలుగురు ఖైదీలలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు ఖైదీలకు కరోనా సోకడంతో ఆగస్టు 27న వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో వారు పోలీసులు, వైద్య సిబ్బంది కళ్లుగప్పి ఆసుపత్రి నుంచి పరారయ్యారు. అందులో ఓ ఖైదీ సోమ సుందర్ను బాలానగర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సోమ సుందర్ దగ్గర తొమ్మిది బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు ఖైదీలు జావిద్, అర్భాస్, నరసింహ గుల్బర్గాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని కర్ణాటకకు పంపారు.