హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని తెలిసే బీజేపీ బీసీ సీఎం రాగాన్ని ఎత్తుకుందని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదని, బీసీ గణన చేయమని అడిగినా కేంద్రం ఒప్పుకోవట్లేదని, అలాంటి పార్టీ బీసీ సీఎం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
బీజేపీ పక్కా బీసీ వ్యతిరేక పార్టీ అన్నారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు పొర్లు దండాలు పెట్టినా అధికారంలోకి రారని అన్నారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్రతిష్ట పాలైందన్నారు. డబ్బులిచ్చి రేవంత్ పీసీసీ పదవి తెచ్చుకున్నాడని ఆరోపించిన రాజగోపాల్రెడ్డి మళ్లీ కాంగ్రెస్లో చేరి టికెట్ తెచ్చుకున్నాడని, దీని వెనుక ఉన్న కథేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.