న్యూఢిల్లీ, వెలుగు: భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ను హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నేతలిద్దరు దేశంలోని తాజా పరిస్థితులు, ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు.
