
కర్ణాటకలో అన్ని పార్టీలు కలిసి బీజేపీని ఓడించాయని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ఒక్క రాష్ట్రంలో గెలవగానే ఇంతలా రెచ్చిపోతున్నారని.. బీజేపీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉందన్నారు. కర్ణాటకలో ఓడినా.. బీజేపీ ఓటు బ్యాంకు ఎక్కడా చెక్కు చెదరలేదని చెప్పారు. ఒక వర్గం ఓట్లతో కాంగ్రెస్ గెలుస్తోందన్నారు. తెలంగాణలో జరిగిన 5 ఉప ఎన్నికల్లో రెండింటిలో బీజేపీ గెలిచిందన్నారు
కర్ణాటకలో అన్ని పార్టీలు మత రాజకీయాలు చేశాయని విమర్శించాయి బండి సంజయ్. 4 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మత రాజకీయాలు చేసిందెవరని ప్రశ్నించారు . ఫక్తు మత రాజకీయాలు చేసింది కాంగ్రెస్సేనని విమర్శించారు. కర్ణాటక రాజకీయాలు తెలంగాణలో పనిచేయబోవన్నారు.
జేడీఎస్ ఓటింగ్ షేర్ 20 నుంచి 13 కు తగ్గిందన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ కు మద్దతిచ్చి కేసీఆర్ అక్కడ పెద్దన్న పాత్ర పోషించాడని అన్నారు. ఒక్క రాష్ట్రంలో గెలవగానే కేంద్రంలో అధికారంలోకి వస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపేనని చెప్పారు. కేసీఆర్ కు తెల్వకుండా హైదరాబాద్ లో క్యాంప్ రాజకీయాలు జరుగుతాయా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ , బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని చెప్పారు.