కంటి వెలుగు పేరుతో కేసీఆర్ ఓట్ల వ్యాపారం : బండి సంజయ్

కంటి వెలుగు పేరుతో కేసీఆర్ ఓట్ల వ్యాపారం : బండి సంజయ్

జనగాం : కంటి వెలుగు పేరుతో సీఎం కేసీఆర్ వ్యాపారం చేస్తుండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఓట్ల కోసమే ఈ పథకం ప్రారంభించారన్న ఆయన.. అందుకే 18 ఏండ్లు దాటినవారికే కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రజల కన్నా ముందు సీఎం కేసీఆర్ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో తాగేందుకు గుక్కెడు నీళ్లు లేకపోయినా, వాడవాడలా బెల్టు షాపులు మాత్రం ఉన్నాయని బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు కానీ కేసీఆర్ ఇంట్లో మాత్రం అందరికీ ఉద్యోగాలున్నాయని విమర్శించారు. సంక్షేమ పథకాలకు పైసల్లేవంటున్న ముఖ్యమంత్రి..  కవితకు దొంగ సారా తయారీకి  రూ. 100 కోట్ల పెట్టుబడి మాత్రం పెట్టాడని ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న సంక్షేమ పథకాలను మేమే ఇస్తున్నమని ముఖ్యమంత్రి ప్రచారం చేసుకుంటున్నారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ పార్టీ ధనికుల పార్టీ అయితే బీజేపీ పేదల పార్టీ అని, నాయకులకు తయారు చేసేందుకే బీజేపీ కార్నర్ మీటింగ్ లు నిర్వహిస్తోందని స్పష్టం చేశారు.