- కేసీఆర్ బీసీ ద్రోహి
- ముఖ్యమంత్రికి మంత్రులు చెక్క భజన చేస్తున్రు: బండి సంజయ్
జనగామ, వెలుగు: సీఎం కేసీఆర్ బీసీ ద్రోహి అని బీజేపీ స్టేట్ చీఫ్బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ ను గద్దె దించేందుకు సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. శుక్రవారం జనగామ శివారులో ప్రారంభమైన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర చిటకోడూరు, చౌడారం, రామచంద్రగూడెం, లక్ష్మీ తండా, మాదారం మీదుగా ఖిలాషాపూర్చేరుకుంది. ఖిలాషాపూర్లో జరిగిన సర్వాయి పాపన్న జయంతి సభలో సంజయ్ మాట్లాడుతూ.. పాపన్న బడుగు బలహీన వర్గాలకు జనరంజక పాలన అందించాడన్నారు. ఇప్పుడు ఆ యోధుడి స్పూర్తితో బీజేపీ ఖిలాషాపూర్లో సభ పెట్టిందని, ఇక కేసీఆర్ గడీలు బద్దలు కొట్టుడు ఖాయమన్నారు. రాష్ట్రంలో మంత్రులంతా సీఎంకు చెక్క భజన చేసే వాళ్లేనని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే పాపన్న చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చుతామని, హైదరాబాద్ నడిబొడ్డున ఆయన విగ్రహం పెడ్తామని సంజయ్ చెప్పారు. న్నారు.
డబుల్ ఇంజన్ సర్కారు రావాలె: లక్ష్మణ్
తెలంగాణలోనూ డబుల్ ఇంజన్సర్కార్ రావాలని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ కే లక్ష్మణ్ అన్నారు. ఖిలాషాపూర్ సభలో ఆయన మాట్లాడుతూ.. పాపన్న స్ఫూర్తితో రాష్ట్రంలోని అవినీతి పాలనను అంతం చేయాలన్నారు. భావితరాలు బాగుపడతాని తెలంగాణ తెచ్చుకుంటే.. ఒక కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మయంగా మారింది. అది క్లౌడ్ బరస్ట్ కాదు.. నీ మెదడు బరస్ట్ అయింది. అందుకే అట్ల మాట్లాడుతున్నవ్” అని సీఎం కేసీఆర్ ను విమర్శించారు.