చిత్తశుద్ధి ఉంటే ఓవైసీని అరెస్ట్ చేయాలి

చిత్తశుద్ధి ఉంటే ఓవైసీని అరెస్ట్ చేయాలి

చిత్తశుద్ధి ఉంటే ఓవైసీ అక్బరుద్దీన్ ను అరెస్ట్ చేయాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ . పీవీ ఘాట్ ,ఎన్టీఆర్ ఘాట్ లను కూల్చేయాలన్న అక్బరుద్దీన్  కామెంట్స్ పై బండి సంజయ్ నిరసన తెలిపారు. పీవీ ఘాట్ కు వెళ్లిన బండి సంజయ్, బీజేపీ ముఖ్య నేతలు  పీవీ జ్ఞానభూమికి నివాళులర్పించారు. పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ రక్షిస్తామని సంజయ్ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా.. ఎంఐఎం వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి  పీవీ,ఎన్టీఆర్ ప్రతీకలు అన్నారు. పార్టీలకతీతంగా తెలుగు జాతి మన్ననలు పొందారన్నారు. తెలుగు వారి ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.

పీవీ జయంతి ఉత్సవాలు చేస్తున్నామని చెబుతున్న కేసీఆర్.. దేశద్రోహ పార్టీ పీవీని విమర్శిస్తే పట్టించుకోరా అని ప్రశ్నించారు. పీవీ,ఎన్టీఆర్ గురించి మాట్లాడితే ఓ వర్గం ఓట్లు పోతాయాని బయపడుతున్నారన్నారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదన్నారు. పీవీపై కేసీఆర్ చిత్తశుద్ధి ఏంటో బయటపడిందన్నారు. పీవీ ఘాట్ ,ఎన్టీఆర్ ఘాట్ కు బీజేపీ రక్షణగా ఉంటుందన్నారు. ఎంఐఎం దేశద్రోహ పార్టీ అని ముస్లీం సమాజమే గుర్తిస్తుందన్నారు. కేసీఆర్ కొడుకుకు ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నాడన్నారు. ఆ రామారావు డ్రామారావు అయ్యాడన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఓవైసీని అరెస్ట్ చేయాలన్నారు. ఓవైసీ వ్యాఖ్యలు దేశద్రోహం కిందకే వస్తాయన్నారు.