దుబ్బాకలో అబద్దాలు చెప్పినందుకే వీపు సాఫ్ అయింది

దుబ్బాకలో అబద్దాలు చెప్పినందుకే  వీపు సాఫ్ అయింది

హరీశ్ రావు అంటేనే అబద్దాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. హరీష్ రావు ఆరోపించినట్టు తాను కేంద్రానికి లేఖ రాసింది రాష్ట్ర అభవృద్ధినీ అడ్డుకునేందుకు కాదని..సంగమేశ్వర ప్రాజెక్ట్ నుంచి   ఏపీ అక్రమంగా నీళ్లు తీసుకెళ్లడంపై లేఖ రాశానన్నారు. దుబ్బాకలో అబద్దాలు చెప్పినందుకే హరీష్ రావు వీపు సాఫ్ అయిందన్నారు. శాసనసభలో లేని వ్యక్తి గురించి విమర్శలు చేయకూడదని ..హరీష్ రావుకు తెలియదా? అని ప్రశ్నించారు. హరీష్ రావు తనపై చేస్తున్న కామెంట్స్ ను పట్టించుకోవాల్సిన అవరసం లేదన్నారు. ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందన్నారు. పార్లమెంటు సమావేశాలకు వెళ్లకుండా కెసిఆర్ మరొకరితో పార్లమెంటు రిజిష్టర్ లో సంతకం చేయించడం పై స్పీకర్ కు పిర్యాదు చేస్తున్నామన్నారు. కేసీఆర్  పెద్ద తప్పు చేశాడని..పార్లమెంటునే తప్పుదోవ పట్టించిన కేసీఆర్ పై చర్యలు ఉంటాయన్నారు.