పబ్లిసిటి కోసమే కేసీఆర్ గాంధీ ఆస్పత్రికి వెళ్లారు

పబ్లిసిటి కోసమే కేసీఆర్ గాంధీ ఆస్పత్రికి వెళ్లారు

సీఎం కేసీఆర్ గాంధీ ఆస్పత్రికి వెళ్లిన విషయంపై తీవ్రంగా స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ గాంధీకి వెళ్లింది ప్రజల సమస్యలు పరిష్కరించడానికి పోయినట్లుగా లేదు.. పబ్లిసిటి కోసమే వెళ్లినట్టు గా ఉందని విమర్శించారు. ఇన్ని రోజులు ఫాం హౌస్ లో పడుకుని బయటకు రాగానే ప్రజలంతా ఆశ్చర్యపోయారన్నారు.ప్రతి పక్ష నేతలు ఆస్పత్రులకు వెళ్తే సమస్యలు కనిపిస్తాయి.. మరి కేసీఆర్ కు ఎందుకు కన్పించలేదని ప్రశ్నించారు బండి సంజయ్. ఆస్పత్రి సిబ్బంది ప్రాణాలకు తెగించి కష్టపడుతున్నారు.. వాళ్ల బాధలు,కష్టాలు కేసీఆర్ కు కన్పించలేదా అని అన్నారు. ఆస్పత్రి సిబ్బందికి జీతాలు పెంచాలని.. మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

గాంధీకి వెళ్లిన కేసీఆర్ పబ్లిసిటి పెంచుకున్నారు తప్ప..ఆయనతో ప్రజలకు జరిగింది ఏమీ లేదన్నారు. అంతేకాదు కేటీఆర్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఒక దొంగల ముఠా అని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి. కేసార్ కుటుంబం దుబాయ్ ఎందుకు వెళ్తోందో.. డబ్బులు ఎక్కడ దాస్తున్నారో.. మీ జాతకాలన్నీ త్వరలోనే బయటపెడతామన్నారు. రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని లేదంటే..రైతాంగ సమస్యలపై ఆందోళన చేపడతామని హెచ్చరించారు బండి సంజయ్.