జీహెచ్ఎంసీలో గెలిపిస్తే LRS పోయింది.. ఎమ్మెల్సీలో గెలిపిస్తే PRC వస్తుంది

జీహెచ్ఎంసీలో  గెలిపిస్తే LRS పోయింది.. ఎమ్మెల్సీలో గెలిపిస్తే PRC వస్తుంది

రాష్ట్రంలో రాక్షస పాలన, గడీల పాలన కొనసాగుతుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. టీచర్లు, నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ఎల్ఆర్ఎస్ పోయిందని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలిపిస్తే ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు పీఆర్సీ వస్తుందన్నారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే సీఎం ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారని చెప్పారు. నల్గొండలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి సంజయ్ హాజరయ్యారు. అంతకు ముందు నల్గొండ జిల్లా చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు సంజయ్.

ఒకే అడ్రస్ పై 32.. బోధన్ లో నకిలీ పాస్ పోర్టుల కలకలం