కరీంనగర్​ పార్లమెంట్​కు రూ.12 వేల కోట్లిచ్చినం: బండి సంజయ్

కరీంనగర్​ పార్లమెంట్​కు రూ.12 వేల కోట్లిచ్చినం: బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు: కరీంనగర్​ పార్ల మెంట్  నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గడిచిన తొమ్మి దేండ్లలో రూ.12 వేల కోట్లు ఇచ్చిందని ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్​ అన్నారు. తొమ్మిదేండ్లలో తన నియోజకవర్గంలోని వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్, ఆ సెగ్మెంట్​లోని గ్రామాల కు ఇచ్చిన నిధుల వివరాలను పథకాల వారీగా ట్విట్టర్​లో ఆయన వివరించారు. వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్​కు రూ. 575.9 కోట్లు, కోనరావుపేట మండలానికి రూ.150.8 కోట్లు ఇచ్చి ఆ ప్రాంతాల అభి వృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేశారని ఆయన చెప్పారు. వేములవాడ నియోజ కవర్గంలోని గ్రామాలకు ఏడు సంక్షేమ పథకాల ద్వారా అందించిన నిధుల వివరాలను కూడా ఆయన పేర్కొన్నారు.