టీఆర్ఎస్ లీడర్లు కొబ్బరికాయలు కొట్టడానికే

టీఆర్ఎస్ లీడర్లు కొబ్బరికాయలు కొట్టడానికే

కేంద్రం చేస్తున్న పనులను కూడా తామే చేయిస్తున్నట్లు డబ్బా కొట్టుకోవడం టీఆర్ఎస్ మానుకోవాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో సోమశిల నుంచి సిద్ధేశ్వరం వరకు మంజూరైన బ్రిడ్జి స్థలాన్ని ఆయన పరిశీలించారు. తర్వాత కృష్ణానదిలో పూజలు చేశారు. సోమశిల బ్రిడ్జి నిర్మాణం కోసం తామే కేంద్రమంత్రి చుట్టూ తిరిగామన్నారు. గొప్పలు చెప్పుకునే టీఆర్ఎస్ లీడర్లు కొబ్బరికాయలు కొట్టడానికే పరిమితం అయ్యారన్నారు. నంద్యాల నుంచి కల్వకుర్తి వరకు రూ.800 కోట్ల నేషనల్ హైవే ప్రతిపాదనను కేంద్రం ఆమోదించిందన్నారు. త్వరలోనే బ్రిడ్జితో పాటు జాతీయ రహదారి నిర్మాణం పూర్తవుతుందన్నారు.