ఓరుగల్లు బస్టాండ్, రైల్వే స్టేషన్ చూస్తే ఎవరి పాలన ఏంటో తెలుస్తుంది

ఓరుగల్లు బస్టాండ్, రైల్వే స్టేషన్ చూస్తే ఎవరి పాలన ఏంటో  తెలుస్తుంది

తలలు నరికే పార్టీ కావాలా ..కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే పార్టీ కావాలా అని ప్రశ్నించారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఓరుగల్లు బస్టాండ్ కి కేంద్రం అధీనంలో ఉన్న రైల్వే స్టేషన్ కి తేడా చూస్తే ఎవరి పాలన ఏంటో అర్థమవుతుందన్నారు. ఓరుగల్లు బస్టాండ్ కూలిపోయే స్థితిలో ఉందన్నారు. బీజేపీ ఒక్క  కార్పొరేటర్ ఉన్న ఓరుగల్లుకి  కేంద్రం వేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు. వడ్డించేవాడికి అధికారం ఇస్తేనే న్యాయం జరుగుతుందన్నారు.  రాబోయే రోజుల్లో ఓరుగల్లులో కరోనా కంటే ఘోరమైన పరిస్థితి వస్తుందన్నారు. వరంగల్ కార్పొరేషన్ లో పేదలకి అండగా ఉండే పార్టీ బీజేపీనేనన్నారు. డబ్బులు తీసుకుని బీజేపీకి ఓటు వేయాలన్నారు. కరోనా కారణంగా పేద ప్రజలు పిట్టల్లా చనిపోతుంటే ..కేసీఆర్ పామ్ హౌస్ లో పడుకున్నారన్నారు. హైదరాబాద్ లో వరదలు వస్తే బాదితులకు పది వేలు ఇచ్చారని..వరంగల్ లో వరదలు వస్తే ఒక్క రుపాయి కూడా ఇవ్వలేదన్నారు.