- మోదీ చెప్పిన 2 కోట్లు కొలువులేవీ?
- మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీకి నిద్రపడ్తలేదు
- అమిత్ షా ఇచ్చిన స్క్రిప్టునే కిషన్ రెడ్డి సదువుతుండు
- పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్కు నష్టం రాకూడదనే బీజేపీ బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ లీడర్లకు నిద్రపట్టడం లేదన్నారు. కొలువుల గురించి ప్రశ్నిస్తున్న కిషన్ రెడ్డి.. మోదీ చెప్పిన రెండు కోట్లు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాసిచ్చిన స్క్రిప్టునే కిషన్ రెడ్డి చదువుతున్నారని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు అమలు సాధ్యం కాదని కామెంట్ చేశారని, కిషన్ రెడ్డికి దమ్ముంటే ఆయన భార్యను ఆర్టీసీ బస్ ఎక్కించాలని, అప్పుడు ఫ్రీబస్ అమలవుతుందో లేదో తెలుస్తుందన్నారు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ దీపాదాస్ మున్షిపై చేసిన వ్యాఖ్యలను జగ్గారెడ్డి ఖండించారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రభాకర్ కు మతి తప్పిందన్నారు.